పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?

పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?






1. పదవీ కాలం ముగియక ముందే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగిం చేవారు?
ఎ) యూపీఎస్సీ చైర్మన్
బి) పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ర్టపతి
సి) సుప్రీంకోర్టు సిఫారసు మేరకు రాష్ర్టపతి
డి) సుప్రీంకోర్టు సిఫారసు మేరకు ప్రధానమంత్రి
సమాధానం: సి
యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల అసమర్థత, దుష్ర్పవర్తన వంటి కారణాలతో పదవీకాలం ముగియక ముందే రాష్ర్టపతి తొలగిం చవచ్చు. సభ్యులపై వచ్చే ఆరోపణల గురించి రాష్ర్టపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపు తారు. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సిఫారసు మేరకు రాష్ర్టపతి చర్య తీసుకుంటారు.

2. పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) అంచనాల కమిటీ
సి) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
డి) సంయుక్త పార్లమెంటరీ కమిటీ
సమాధానం: బి
అంచనాల కమిటీ పార్లమెంటరీ కమిటీ లన్నింటిలో అతి పెద్దది. ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీల్లో 22 మంది చొప్పున సభ్యులుంటారు. అంచనాల కమిటీలో 30 మంది సభ్యులుంటారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుల సంఖ్యను ఆయా సందర్భాలను అనుసరించి ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఒక అడహాక్ (తాత్కాలిక) కమిటీ మాత్రమే. నిరంతర మిత వ్యయ కమిటీగా పేర్కొనే అంచనాల కమిటీ సభ్యులందరూ లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నికవుతారు

3. భారతదేశంలో న్యాయశాఖదే క్రియాశీలక పాత్ర అనే భావన ఏ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది?
ఎ) 1960 బి) 1970 సి) 1980 డి) 1990
సమాధానం: సి
న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావనా లేదు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షణ, ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1980ల్లో సుప్రీంకోర్టులో ప్రధాన, సాధారణ న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ ఎస్. ఎం.సిక్రీ, హెచ్.ఆర్. ఖన్నా, పి.ఎన్.భగవతి, వి.ఆర్.కృష్ణయ్యర్‌లు న్యాయశాఖ క్రియాశీల కత్వంలో ప్రధానపాత్ర పోషించారని పేర్కొనొచ్చు. తాజ్‌మహల్ చుట్టూ కాలు ష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసి వేయడం, బాలకార్మిక వ్యవస్థ నిషేధంలో న్యాయశాఖ పాత్ర చెప్పుకో దగింది.

4. ఎవరి సూచనల ప్రకారం యూపీఎస్సీకి అదనపు బాధ్యతలను అప్పగించొచ్చు?
ఎ) కేంద్ర హోంశాఖా మంత్రి
బి) పార్లమెంట్
సి) కేంద్ర మంత్రి మండలి డి) రాష్ర్టపతి
సమాధానం: బి
పార్లమెంట్ తీర్మానం అనుసరించి యూని యన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అదనపు విధు లు అప్పగించొచ్చు. పార్లమెంట్ తీర్మానం లేనిదే కమిషన్ విధుల్లో ఎలాంటి మార్పులూ చేయలేం.

5. వీటిలో పంచాయితీరాజ్ సంస్థల విషయంలో రాష్ట్రాలు నిర్వర్తించాల్సిన అంశం?
ఎ) మూడంచెల విధానం
బి) రెండంచెల విధానం
సి) కొన్ని రాష్ట్రాలకు మూడంచెల విధానం విషయంలో మినహాయింపు ఉంది
డి) రాష్ట్రాలకు ఈ విషయంలో ఐచ్ఛికాంశం మాత్రమే
సమాధానం: డి
73వ రాజ్యాంగ సవరణ అనుసరించి రాష్ట్రాల్లోని పంచాయితీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానాన్ని సూచించారు. నేటికీ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మూడంచెల విధానం కొనసాగుతోంది. ఐతే జమ్మూ, కాశ్మీర్‌లో రెండంచెలు, పశ్చిమ బెంగాల్‌లో నాలుగంచెల విధానం అమల్లో ఉంది. ఈ విషయంలో రాష్ట్రాల ఐచ్ఛికతకు వదిలేశారు. 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మధ్యంతర వ్యవస్థకు మినహా యింపు ఉంది.

6. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పదవీ విరమణ చేసినవారు కేంద్రంలో లేదా రాష్ర్టంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిం చరాదు. కానీ కింది ఏ విషయంలో మిన హాయింపు ఉంది?
ఎ) భారత ప్రధాన న్యాయమూర్తిగా
బి) ప్రధాన ఎన్నికల అధికారిగా
సి) యూపీఎస్సీ సభ్యులుగా
డి) లోక్‌సభ స్పీకర్‌గా
సమాధానం: సి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారు యూని యన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా పని చెయొచ్చు.

7. 352వ అధికరణలో (జీ)వ క్లాజ్‌ను చేర్చడం ద్వారా ‘ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులకు’ బదులు ‘సాయుధ తిరుగుబాటు’ అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42 బి) 44 సి) 32 డి) 34
సమాధానం: బి
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అంత రంగిక కారణాలతో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో పౌరుల హక్కులకు కలిగిన భంగాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరంగిక అల్లకల్లోల పరిస్థితు లు అనే పదానికి బదులు సాయుధ తిరుగు బాటు అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

8. భారతదేశ విభజనకు ఏ అంశం ఆధారంగా బ్రిటిషర్లు అంగీకరించారు?
ఎ) కేబినెట్ మిషన్ ప్లాన్
బి) మౌంట్ బాటన్ ప్లాన్
సి) క్రిప్స్‌మిషన్ ప్లాన్ డి) సిమ్లా ఒప్పందం
సమాధానం: బి
ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తే.. కాంగ్రెస్ దేశ విభజనకు అంగీక రించలేదు. దీంతో ఈ రెండు సంస్థల మధ్య అగాధం నెలకొంది. ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రత్యక్ష చర్యకు పూనుకోవడంతో అనేక ప్రాంతాల్లో హింస, మత కల్లోలాలు చెలరేగాయి. పరిస్థితులు చక్కదిద్దడంలో లార్‌‌డవేవెల్ విఫలమయ్యారు.

దీంతో లార్‌‌డ మౌంట్ బాటన్‌ను వేవెల్ స్థానంలో గవర్నర్ జనరల్‌గా నియమించారు. విభజనకు సంబంధించిన ప్రణాళికను మౌంట్‌బాటన్ ప్రవేశపెట్టారు. దీన్నే ఢిక్కీబర్‌‌డ పథకం అని కూడా అంటారు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు పాకిస్థాన్‌లో, హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు భారత్‌లో, స్వదేశీ సంస్థానాలు ఏ భాగంలో నైనా విలీనం కావచ్చొని, వివాదాస్పద ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించాలని ఆ పథకంలో పేర్కొన్నారు.

9. భారత రాజ్యాంగ సవరణ పద్ధతికి మూలం?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) భారత స్వాతంత్య్ర చట్టం 1947
సి) అమెరికా రాజ్యాంగం
డి) బ్రిటన్ రాజ్యాంగం
సమాధానం: ఎ
భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని మన దేశం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించినప్పటికీ 1935 భారత ప్రభుత్వ చట్టంలో సవరణకు సంబంధించిన అంశాలు వివరంగా పేర్కొన్నారు. 1935 చట్టాన్ని అనుసరించి ఆనాటి బ్రిటీష్ రాజమకుటం ఆమోదంతోనే సవరించాలి. స్వాతంత్య్రం అనంతరం పార్లమెంట్ ఆమోదించే సవరణ బిల్లుకు రాష్ర్టపతి ఆమోదముద్ర వేయాలి.

10. బిటిషర్లు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం మన ప్రభుత్వ విధానాన్ని ఏకకేంద్ర విధానం నుంచి సమాఖ్యవైపు మరల్చింది?
ఎ) మాంటేగ్-చేమ్స్‌ఫర్‌‌డ సంస్కరణల చట్టం 1919
బి) 1909 కౌన్సిల్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) భారత స్వాతంత్య్ర చట్టం 1947
సమాధానం: సి
1930లో లార్‌‌డ సైమన్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1930, 1931, 1932ల్లో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా విస్తృత సంప్రదింపులు జరిపింది. భారతదేశానికి ఏకకేంద్ర ప్రభుత్వం కంటే సమాఖ్య ప్రభుత్వమే ఉత్తమం అని సైమన్ కమిషన్ సిఫారసు చేసింది. విశాల భూ భాగం, పరిపాలనా పరిధి, భిన్న సంస్కృ తుల వల్ల దేశంలో సమాఖ్య ప్రభుత్వమే సరైందని భావించి 1935 చట్టం ద్వారా సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టారు.

11. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక స్వరూపం లో అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
ఎ) గోలక్‌నాథ్ -1967
బి) మేనకాగాంధీ - 1978
సి) మినర్వామిల్- 1980
డి) కేశవానంద భారతి- 1973
సమాధానం: డి
రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భా గమే అని 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం లేదని సుప్రీకోర్టు పేర్కొంది. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీతో సహా ఇతర న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ ప్రవేశికలోని సార్వభౌమత్వం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఏకత, గణతంత్ర విధానం, ప్రజాస్వామ్యం మొదలైన అంశాలన్నీ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొన్నారు.

12. ఏ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ అధికరణకు 4(ఎ)ను చేర్చారు?
ఎ) భారత ప్రభుత్వం వర్సెస్ కాశీకర్
బి) ఇందిరా సహానీ వర్సెస్ భారత ప్రభుత్వం
సి) శివచంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్
డి) డీటీసీ వర్సెస్ మజ్దూర్ కాంగ్రెస్
సమాధానం: బి
మండల్ కేసుగా పిలిచే ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 77వ రాజ్యాంగ సవరణ చేశారు. 16(4)ఎ అధికరణ ప్రకారం ఉద్యోగులకు ఇచ్చే పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు సమర్థించింది.

13. లోక్‌సభ సీట్లలో కొన్నింటిని ఏ వర్గాలకు రిజర్వ్ చేయలేదు?
ఎ) షెడ్యూల్డ్ కులాలు బి) షెడ్యూల్డ్ తెగలు
సి) స్వయం పాలిత జిల్లాలుగా షెడ్యూల్డ్ తెగలకు అస్సాంలో కల్పించిన రిజర్‌‌వడ్ సీట్లు
డి) ఆంగ్లో-ఇండియన్లకు
సమాధానం: డి
భారత రాజ్యాంగంలోని 330వ అధికరణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లోక్‌సభ స్థానాల్లో జనాభా అనుసరించి సీట్లను రిజర్‌‌వ చేశారు. అస్సాంలోని కొన్ని జిల్లాల్లో ఏర్పడిన అటానమస్ కౌన్సిల్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా షెడ్యూల్డ్ తెగలకు సీట్లు రిజర్‌‌వ చేశారు. ఆంగ్లో-ఇండియన్లకు ప్రత్యేకంగా రిజర్‌‌వ చేసిన నియోజకవర్గాలు లేవు. 331వ అధికరణ ప్రకారం లోక్‌సభలో ఆంగ్లో- ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేదని భావించినపుడు రాష్ర్టపతి ఇద్దరిని లోక్‌సభకు నామినేట్ చేస్తారు.

14. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాంతాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఎ) డీలిమిటేషన్ కమిటీ
బి) కేంద్ర ఎన్నికల కమిషన్
సి) జనాభా లెక్కల సేకరణ కమిషన్
డి) భారత రాష్ర్టపతి
సమాధానం: బి
నియోజకవర్గాల పునర్‌వ్య వస్థీకరణ బాధ్యత భారత ఎన్నికల కమిషన్‌ది. 82వ అధికరణ ప్రకారం జనాభా లెక్కల సేకరణ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడే డీలిమిటేషన్ కమిటీలో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒకరు, రాష్ర్ట ఎన్నికల అధికారి, ఆ ప్రాంత రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉండి నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు చేస్తారు.

15. పజా ప్రాతినిధ్య చట్టం-1951 సవరిస్తూ ఎన్నికల వివాదాలను విచారించే అధికారం హైకోర్టులకు కల్పించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 16వ బి) 17వ సి) 18వ డి) 19వ
సమాధానం: డి

No comments:

Post a Comment