విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే

విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే

గ్రూప్-1 మెయిన్స్‌లో మిగిలిన విభాగాల కంటే భిన్నమైంది జనరల్ ఎస్సే.. గత ఫలితాలను విశ్లేషిస్తే..తుది విజేతలను నిర్ణయించడంలో ఈ విభాగమే కీలకమనే విషయుం అవగతవువుతుంది.. అభ్యర్థిలోని సృజనాత్మకత, సంపూర్ణ విషయావగాహన, వర్తవూన అంశాలపై పట్టు వంటి అంశాలను పరీక్షించడానికి ఉద్దేశించిన .. ఈ విభాగమే.. గ్రూప్-1లో విజయూనికి కీలకం.. పక్కా ప్రణాళిక, భిన్న కోణాల్లోంచి విషయూన్ని ప్రెజెంట్ చేసే చతురత ఉంటే ఈ పేపర్‌లో చక్కని స్కోరు సాధించవచ్చు.

ఇందులో ఒక్కో విభాగం నుంచి మూడు ప్రశ్నలు అడుగు తారు. వాటిలో ఒక్క ప్రశ్నకు వూత్రమేసమాధానం రాయాలి. అంటే మొత్తం మీద మూడు వ్యాసరూప ప్రశ్నల కు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 50 వూర్కులు కేటారుుంచారు. గతంలో మూడు గంటల సమయంలో కేవలం ఒక వ్యాసరూప ప్రశ్నకు సవూధానం ఇస్తే సరిపోయేది. ప్రస్తుత విధానంలో అంతే సవుయుంలో మూడు ప్రశ్నలకు సవూధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ప్రిపరేషన్ నుంచే ఈ పేపర్‌ను సరికొత్త దృక్కోణంలో చూడాలి.

గత గ్రూప్-1 పేపర్‌లో వివిధ పేపర్లలో అభ్యర్థులు పొందిన మార్కులను పరిశీలిస్తే.. మిగతా పేపర్లతో పోల్చి తే ఎస్సే పేపర్ స్కోరింగ్ తీరులో చాలా వ్యత్యాసాన్ని గవు నించవచ్చు. ఈ విభాగంలో 80-120 స్థాయిలో మార్కు లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అదే సవు యుంలో 40 నుంచి 50 మార్కులు మాత్రమే సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి గత గ్రూప్-1 విజే తలను నిర్ణరుుంచడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిం చిందనే విషయుం స్పష్టవువుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగం ప్రిపరేషన్ విషయుంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటు వంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంప్రదాయు పద్ధతులకు బదులు.. సాంకేతికంగా, శాస్ర్తీయమైన ప్రిపరేషన్ కొనసా గించాలి.

గతంలో ఉన్న వుూడు గంటల వ్యవధిలో ఒక వ్యాసం రాసేటప్పుడు.. దానికి సంబంధించిన వివరణ, సుదీర్ఘ పరిచయుం ఇచ్చేవారు. అంతేకాకుండా వ్యాసం నేపథ్యాని కి, వుుగింపునకు తగిన ప్రాధాన్యం కల్పించేవారు.గంటకు ఒక్క వ్యాసం రాయూల్సిన ప్రస్తుత విధానంలో.. ఈ తరహా విధానానికి స్వస్తి పలకడమే మేలు. అభ్యర్థిలోని సృజనా త్మకత, అవగాహన, వర్తవూన అంశాలపై పట్టు తదితర అంశాలను పరీక్షించడానికి ఈ విభాగం ఉపయోగపడు తుంది. కాబట్టి అభ్యర్థి ఏ విషయుంపై వ్యాసం రాస్తున్నా.. సంబంధిత లక్ష్యం సాధించేలా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయు డం వుంచిది. అంతేకాకుండా సరళమైన భాషను వినియో గిస్తు.. చిన్న పదాలలో భావం అర్థవుయ్యేలా రాయాలి.

ప్రిపరేషన్‌లో.. కీలకాంశాలు
ప్రతి విభాగం నుంచి ప్రస్తుత పరిస్థితులాధారంగా ఏఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వాటికి సంబంధించి ఒక అవగాహనకు రావాలి.
గుర్తించిన అంశాలపై ఎన్ని రకాల నేపథ్యాల నుంచి ప్రశ్నలు అడగవచ్చో ముందుగానే అంచనాకు రావడం వుంచిది.
గుర్తించిన అంశాలకు సంబంధించిన ముఖ్య గణాంక సమాచారాన్ని సేకరించుకోవాలి.
అంశానికి సంబంధించిన సమకాలీన నేపథ్యాన్ని అవగాహన చేసుకోవాలి.
సంబంధిత సమస్యలను గుర్తించాలి.
సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి.

ఈ రకమైన అధ్యయనంతో ఒక్కో విభాగం నుంచి కనీసం నాలుగు అంశాల చొప్పున మొత్తం 12 వ్యాసాల కు ప్రిపేర్ కావడం చాలా అవసరం. అంతేకాకుండా నిర్దే శించిన కాలవ్యవధిలో ప్రభావవంతమైన వ్యాసం రాయు డాన్ని ప్రాక్టీస్ చేయుడం కూడా అవసరం. ప్రాక్టీస్ చేసిన వ్యాసంపై సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. దీని వల్ల అభ్యర్థులు ఊహించని విధంగా ప్రశ్న వచ్చినా సమర్థంగా ప్రతిస్పందించే లక్షణం అలవడు తుంది.

ప్రతి వ్యాసాన్ని ప్రారంభించే ముందు దానికి గంట లోపలే సమాధానం రాయాల్సి ఉంటుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలి. ప్రశ్నను రెండు-వుూడు సార్లు జాగ్రత్త గా చదవడం వుంచిది. కొంత మంది అభ్యర్థులు తొందర లో ప్రశ్నను సరిగ్గా చదువకుండానే జవాబును ప్రారంభి స్తారు. దాంతో అడిగిన ప్రశ్నకు.. సవూధానానికి ఏ వూత్రం పొంతన లేకుండా వ్యాసం సాగుతుంది. ఇక్కడ గవునించాల్సిన వురొక అంశం గతంలోలాగ ప్రశ్న ఒక పద బంధంలో ఉండటం లేదు. ఉదా: బాల కార్మిక వ్యవస్థ గురించి రాయండి?, మహిళ సాధికారత గురించి రాయండి? అనే రీతిలో ప్రశ్నలు ఉండటం లేదు. ఒక అంశానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేక కోణం లేదా సమస్యను లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలడుగుతున్నారు.

ఉదాహరణకు బాల కార్మిక వ్యవస్థను తీసుకుంటే.. బాల కార్మిక వ్యవస్థ ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఆర్థిక మూలాలు ఉన్నాయి. వ్యాఖ్యానించండి?
ఈ రకమైన ప్రశ్నకు సంప్రదాయ పద్ధతిలో సవూధా నం ఇస్తే అంత ప్రభావవంతంగా ఉండదు. మెుదట ప్రశ్నను ఏ కోణంలో అడుగుతున్నారో గవునించి.. అదే నేపథ్యంలో సమాధానం రాయాలి. వ్యాసాన్ని ప్రారం భించడానికి ముందు కనీసం అయిదు నిమిషాలు జాగ్ర త్తగా ఆలోచించి.. వ్యాసంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఒక అవగాహన ఏర్పర్చుకోవాలి. తర్వాత దానికనుగుణం గా నిర్మాణాత్మకంగా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయూలి.

వ్యాసం రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
సమకాలీన నేపథ్యం
సమస్య-వివిధకోణాలు
సమస్య కారణాలు ప్రభుత్వ చర్యలు
ప్రస్తుత స్థితి
పరిష్కార మార్గాలు
నిర్మాణాత్మక సూచనలు

పేపర్-1 జనరల్ ఎస్సే (వ్యాసం)
ఈ పేపర్‌లో మూడు విభాగాలు ఇచ్చారు. అవి
ఎ)సంక్షోభ నిర్వహణ, సామాజిక సమస్యలు- విశ్లేషణ, పరిష్కారాలు
బి)జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమకాలీన సమస్యలు
సి)ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమకాలీన సంఘటనలు/అంశాలు

మొదటి యూనిట్
గత గ్రూప్-1 మొదటి యూనిట్‌లో దుర్భిక్షం, స్ర్తీ, పురుష నిష్పత్తి, ఆర్థిక సంక్షోభం అంశాల మీద ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నలు స్థూలంగా లేవు. ఈ విషయాన్ని అభ్యర్ధులు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.
ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
జనాభా విస్ఫోటం.
వ్యవసాయ రంగంలో క్షీణిస్తున్న దిగుబడులు, అంతంత మాత్రంగా వృద్ధి రేట్లు.
భారతదేశం వైద్య అత్యవసర పరిస్థితులు-ప్రభుత్వ సమాయత్తత.
మహిళలపై అత్యాచారాలు-గృహహింస-లైంగిక వేధింపులు.
పెరుగుతున్న ఆత్మహత్యల రేట్లు-సామాజిక ఒత్తిడి.
భారతదేశంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు-ప్రభుత్వ యంత్రాంగ ప్రతిస్పందన.

రెండో యూనిట్
రెండో యూనిట్ (జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన సంఘటనలకు సంబంధించిన) నుంచి గత గ్రూప్-1లో యుూరోపియున్ యూనియన్, ఇండో- యూఎస్‌ఏ అణు ఒప్పందం, ఇస్రోలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం.
ఆసియా ఖండంలో యూఎస్‌ఏ దౌత్య నీతి-చైనాను చుట్టుముట్టడం.
కాశ్మీర్ సమస్య పరిష్కారంలో యూఎస్‌ఏ పాత్ర.
కాశ్మీర్‌లో శాంతి స్థాపన.
అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై వికీలీక్స్ ప్రభావం
అయోధ్య వివాదంపై అలహాబాద్ న్యాయస్థానం తీర్పు.
కార్పొరేట్ లాబీయింగ్- ప్రసారమాధ్యమాల పాత్ర.

మూడో యూనిట్
మూడో విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన సమ కాలీన సంఘటనలు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. గత గ్రూప్-1లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఆర్‌ఈజీపీ పథకం అమలు, ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయితీరాజ్ వ్యవస్థపై ప్రశ్నలు అడిగారు.

ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మరుణ సంస్థల కార్యకలాపాలు- చట్ట నియంత్రణ సాధ్యమేనా?సబబేనా?
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధి ఉద్యమాలు-ప్రాంతీయ, సమైక్య వాదాలు.
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కార్పొరేట్ ధోరణులు- విద్యాహక్కు చట్టం అమలు.
రాష్ట్ర సహకార రంగ ప్రక్షాళన- ప్రతిపాదిత ఏకీకృత చట్టం.
రాష్ట్రంలో అతివృష్టి-వ్యవసాయ రంగంపై ప్రభావం.
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి-సమకాలీన సమస్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో సేద్యపు నీటి ప్రాజెక్టులు నిర్మాణం- పర్యావరణ, ఇతర అడ్డంకులు.

                                                                   -గురజాల శ్రీనివాసరావు
                                                        సివిల్స్ సీనియర్ అధ్యాపకులు, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

No comments:

Post a Comment