కరెంట్ అఫైర్స్-డిసెంబర్ -2010 సంచిక 4

1.భారత్ కు ఫ్రాన్స్ అణు సహకారం
ఫ్రాన్స్ అధ్యక్షుడు నికో లస్ సర్కోజీ భారత పర్యటనలో డిసెంబర్ 6 న ఇరు దేశాల వుధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరారుు. ఇందులో ఐదు అణు ఇంధనానికి సంబంధించినవి కాగా, రెండు భూ శాస్త్ర విజ్ఞానానికి చెందినవి. విద్యారంగానికి సంబంధించి కూడా మరో రెండు ఒప్పందాలు కుదిరారుు. అణు రంగంలో భారత్‌పై అంతర్జాతీయు ఆంక్షలు తొలగిపోరుున రెండేళ్లకు.. భారత్‌లో అణు రియూక్టర్లు నెలకొల్పేందుకు ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహనలో భాగంగా వుహారాష్టల్రోని జైతాపూర్‌లో ఏర్పాటు చేయు నున్న ఆరు అణు రియూక్టర్లలో మెుదటి రెండింటిని ఫ్రాన్స్ నెలకొల్పుతుంది. ఈ ఒప్పందంపై భారత్‌కు చెందిన న్యూక్లియుర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ, ఫ్రాన్స్ కంపెనీ అరేవా ప్రతినిధులు.. నికోలస్ సర్కోజీ, ప్రధాని వున్మోహన్ సింగ్ సవుక్షంలో సంతకాలు చేశారు. ఉన్నత మైన టెక్నాలజీ సంస్థల్లో సంయుుక్త పరిశోధన, విద్యా వూర్పిడి కార్యక్రవూలను ప్రోత్సహించేందుకు విద్యా ఒప్పందాలు దోహదం చేస్తారుు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2012 నాటికి 1,200 కోట్ల యుూరోలకు పెంచాలని కూడా ఇరువురు నేతలు నిర్ణరుుంచారు. రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం, అంతరిక్షం, శాస్త్ర సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి కూడా ఇరువురు నాయుకులు చర్చించారు.

2.ముగిసిన కాన్‌కున్ సదస్సు
మెక్సికోలోని కాన్‌కున్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 16వ వాతావరణ వూర్పు సదస్సు డిసెంబర్ 11న వుుగిసింది. ఈ సందర్భంగా కాన్‌కున్ ఒప్పందాన్ని సదస్సు ఆమోదిం చింది. దీనికి 193 దేశాలు వుద్దతు పలికారుు. దీని ప్రకా రం గ్లోబల్ వార్మింగ్ నివారణకు 100 బిలియున్ డాలర్లతో ‘గ్రీన్ ఫండ్’ ఏర్పాటు చేస్తారు. ఈ నిధి వల్ల అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు లాభపడతారుు. అడవుల క్షీణత -నరికివేత వల్ల కలిగే ఉద్గారాల తగ్గింపు అంశం కూడా ఒప్పందంలో చోటు చేసుకుంది. అదే సవుయుంలో ఉద్గా రాల తగ్గింపునకు సంబంధించి 2012తో వుుగియునున్న క్యోటో ప్రోటోకాల్ పొడిగింపునకు సంబంధించి ఎటు వంటి ఒప్పందం కుదరలేదు.

3.కకోద్కర్‌కు హోమీ బాబా అవార్డు
ప్రతిష్టాత్మక ‘హోమీ బాబా లైఫ్ టైం అచీవ్‌మెంట్’ అవా ర్డుకు అణుశక్తి కమిషన్ వూజీ చైర్మన్ అనిల్ కకోద్కర్ ఎంపికయ్యూరు. ఈ పురస్కారాన్ని జనవరి 17, 2011న జరిగే ఇండియున్ న్యూక్లియుర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) వార్షిక సవూవేశంలో బహూకరిస్తారు.

4.యుూపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌కు జైలు శిక్ష
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వూజీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) నీరా యూదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 8న నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. నీరా 1992-94లో నోరుుడా అభి వృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సవుయుంలో.. ప్లాట్ల కేటాఇంపులో నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.

5.ఎర్డోగన్‌కు అల్-గడాఫీ వూనవ హక్కుల అవార్డు
టర్కీ ప్రధానవుంత్రి ఎర్డోగన్, అల్- గడాఫీ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ హ్యువున్ రైట్స్‌కు ఎంపిక య్యూరు. లిబియూ రాజధాని ట్రిపోలిలో జరిగిన ఒక కార్య క్రవుంలో ఆయునకు ఈ పురస్కారాన్ని బహూకరించారు. లిబియూ నాయుకుడు వవుర్ అల్ గడాఫీ పేరిట 1988లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. వూనవ హక్కుల రక్షణ, స్వేచ్ఛ, ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2009లో నికరాగ్వా అధ్యక్షుడు జోస్ డేనియుల్ ఒర్టేగాకు ఈ అవార్డు దక్కింది. గతంలో దక్షిణాఫ్రికా వూజీ అధ్యక్షుడు నెల్సన్ వుండేలా, వెనుజులా అధ్యక్షుడు విక్టర్ హ్యుగో చావెజ్‌లను ఈ పురస్కారం వరించింది.

6.వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు
వికీలీక్స్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు జూలియున్ అసాంజేను బ్రిటన్ పోలీసులు డిసెంబర్ 7న అరెస్టు చేశారు. స్వీడన్ జారీ చేసిన అంతర్జాతీయు వారంటుపై ఆయునను అదుపు లోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియూ పౌరుడైన 39ఏళ్ల అసాంజే పై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది.

7.‘డ్రాగన్’ ప్రయోగం
నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ రూపొందిం చిన అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ను ఫ్లోరిడాలోని కేప్‌కెనావరల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 8న ఫాల్కాన్-9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రైవేట్ సంస్థ ప్రయోగించిన మెుదటి అంతరిక్ష నౌక ఇది. అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ ఎస్) వస్తువులను చేరవేసేందుకు నాసా, స్పేస్ ఎక్స్‌తో కుదుర్చుకున్న 1.6 బిలియున్ డాలర్ల ఒప్పందంలో భాగం గా స్పేస్ ఎక్స్ 12 స్పేస్‌క్రాఫ్ట్‌లను తయూరు చేయునుంది.

8.గస్తీ నౌక ‘విజిత్’ ప్రారంభం
భారత తీర గస్తీనౌక ‘విజిత్’ను డిసెంబర్ 11న గోవాలో ప్రారంభించారు. దీన్ని గోవా షిప్‌యూర్డ్ లిమిటెడ్ నిర్మిం చింది. భారత్-పాకిస్థాన్ సవుుద్ర సరిహద్దులో విజిత్ గస్తీ నిర్వహిస్తుంది.

9.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 సంవత్సరానికి రఘుపతి వెంకయ్యపురస్కారంతో సహా వుూడు జాతీయు చలనచిత్ర అవార్డులను డిసెంబర్ 6న ప్రకటించింది. వివరాలు.. రఘుపతి వెంకయ్యు అవార్డు: ప్రవుుఖ నిర్మాత కె.రాఘవ, ఎన్‌టీఆర్ జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ నటి బి.సరోజాదేవి, బీఎన్ రె డ్డి జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, నాగిరెడ్డి, చక్ర పాణి జాతీయు అవార్డు: రామోజీరావు.

10.భారత్ - ఈయూ(EU) సదస్సు
భారత్- యుూరోపియున్ యుూనియున్(ఈయుూ) 11వ వార్షిక సదస్సు బ్రస్సెల్స్‌లో డిసెంబర్ 10న జరిగింది. సవూవేశానికి భారత ప్రధాని వున్మోహన్ సింగ్ హాజర య్యూరు. 27 సభ్యదేశాలున్న భారత్-ఈయుూ సదస్సులో పలు అంశాలపై పరస్పర సహకారాన్ని వురింత పటిష్టం చేసు కోవడానికి అంగీకరించారుు. సాంస్కృతిక సంబంధా ల మెరుగు, నేరస్తుల అప్పగింత వంటి అంశాలు ఇందులో ఉన్నారుు. వచ్చే సంవత్సరం మెుదట్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా సదస్సు నిర్ణరుుంచింది.

11.డేవిస్ కప్ విజేత సెర్బియూ
డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను సెర్బియూ జట్టు గెలుచుకుంది. బెల్‌గ్రేడ్‌లో డిసెంబర్ 5న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిం చింది. సెర్బియూ మెుదటి సారి డేవిస్‌కప్‌ను గెలుచుకుంది.

టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్లలో డేవిస్ కప్, ఫెడ్ కప్, హాప్ వ్యూన్ కప్‌లను ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తారు. వీటిలో డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ విభాగం. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్ 1900లో ప్రారంభమైంది. వుహిళల విభాగం లో ఫెడ్ కప్(1995 వరకు ఫెడరేషన్ కప్‌గా వ్యవహరించే వారు) ప్రతిష్టాత్మకమైంది. దీనిని ఐటీఎఫ్ 50వ వార్షికోత్స వం సందర్భంగా 1963లో ప్రారంభించారు. మిక్స్‌డ్ విభా గంలో హాప్‌వ్యూన్ కప్ ప్రతిష్టాత్మకమైంది. దీనిని 1989 నుంచి నిర్వహిస్తున్నారు.

డేవిస్ కప్‌ను ప్రారంభంలో ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ చాలెంజ్‌గా వ్యవహరించేవారు. 1900లో టోర్నీ ప్రారంభ వ్యూచ్ యుూఎస్‌ఏ, గ్రేట్ బ్రిటన్ వుధ్య జరిగింది. ఈ వ్యూచ్‌కు బోస్టన్‌లోని లాంగ్‌ఉడ్ క్రికెట్ క్లబ్ ఆతిథ్యమిచ్చిం ది. ప్రారంభంలో కొన్ని దేశాలు వూత్రమే ఈ టోర్నమెంట్ లో పాల్గొనేవి. టెన్నిస్‌లో ఓపెన్ యుుగం ప్రారంభమైన తర్వాత 1969లో 50 దేశాలు ఇందులో పోటీ పడ్డారుు. కాగా 2010 టోర్నీలో 125 దేశాలు పాల్గొన్నారుు.

డేవిస్ కప్ నిర్వహించాలనే ఆలోచన.. హార్వర్డ్ యుూనివర్సి టీకి చెందిన నలుగురు విద్యార్థులది. వీరిలో డ్వైట్ డేవిస్ ఒకరు. అతనే ఈ టోర్నమెంట్ ఫార్మాట్‌ను రూపొందించ డంతోపాటు తన సొంత డబ్బుతో టోర్నీకోసం ట్రోఫీని కూడా బహూకరించారు. తర్వాత డేవిస్ అమెరికా రాజకీ యూల్లో ప్రవుుఖుడిగా పేరుగాంచడంతో పాటు 1925-29 వుధ్య యుూఎస్ సెక్రటరీ ఆఫ్ వార్‌గా బాధ్యతలు నిర్వహించా రు. అతని గౌరవార్థం ఈ టోర్నీ ని డేవిస్ కప్‌గా వ్యవహరించడం ప్రారంభించారు.

ఇప్పటి వరకు 13 దేశాలు వూత్రమే డేవిస్ కప్ విజేతలుగా నిలిచారుు. అత్యధికంగా యుూఎస్‌ఏ 32 సార్లు ఈ ట్రోఫిని సాధించింది. 28 టైటిల్స్‌తో ఆస్ట్రేలియూ తర్వాతి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ (9సార్లు), స్వీడన్(7 సార్లు) డేవిస్ కప్‌ను సాధించారుు. భారత్ 1921 నుంచి ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. 1966, 1974, 1987లలో వుూడు సార్లు రన్నర్‌గా (1974లో దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ఆ దేశంతో ఫైనల్ ఆడటానికి భారత్ నిరాకరించింది) నిలిచింది.

12.హాంకాంగ్ ఓపెన్ విజేత సైనా
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించింది. డిసెంబర్ 12న జరిగిన ఫైనల్లో షిజియూన్ వాంగ్(చైనా)ను సైనా ఓడించింది. 1982లో ప్రకాశ్ పదుకొనే తర్వాత హాంకాంగ్ టైటిల్ సాధించిన తొలి భారతీయుురాలిగా కూడా సైనా గుర్తింపు పొందింది. ఇది సైనాకు నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఇండియూ, సింగపూర్, ఇండోనేషియూ ఓపెన్‌లలో సైనా విజేతగా నిలిచింది.

13.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీలో జరిగిన గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సదస్సు డిసెంబర్ 7న వుుగిసింది. 1981లో ఏర్పాటైన జీసీసీలో సౌదీ అరేబియూ, కువైట్, బహ్రెయిన్, ఒవున్, ఖతార్, యుుఏఈలు సభ్య దేశాలు.

14.భారత్‌లో అంతరిస్తున్నజంతు వుల ఇతివృత్తంతో డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) 2011 క్యాలెం డర్‌ను రూపొందించింది.

15.సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్‌చానల్‌కు చెందిన కరణ్ థాపర్‌కు ‘బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రెజెంటర్’గా ఏషియున్ టెలివిజన్ పురస్కారం దక్కింది. థాపర్‌కు ఈ అవార్డు రావడం ఐదోసారి.

16.న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 5-0 తేడాతో గెలుచుకుంది. భారత జట్టు కెప్టెన్ గౌతమ్‌గంభీర్ వ్యూన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యూరు.
                                                                            -ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి
                                                                             కరెంట్ అఫైర్స్ నిపుణులు

No comments:

Post a Comment