అన్నా హజారే ఎవరు..? ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష..!?

అన్నా హజారే ఎవరు..? ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష..!?
 అవినీతిపై అహింసా అస్త్రాన్ని సంధించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపకరించిన ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే గురించి తెలుసుకోవాల్సిన పది విషయాలు...

1. అసలు అన్నా హజారే ఎవరు..?
ఓ మాజీ ఆర్మీ వ్యక్తి. 1965 భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన వీరుడు.

2. అతనిలో అంత ప్రత్యేకమైన అంశం ఏంటి..?
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో రాలేగావ్ సిద్ధి అనే గ్రామాన్ని నిర్మించారు.

3. అయితే ఏంటి..?
ఈ గ్రామం పూర్తిగా స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడినది. ఇక్కడి విద్యుత్‌ను కూడా గ్రామస్తులే స్వంతంగా.. సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్‌ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. 1975లో ఈ గ్రామం అత్యంత దారిద్ర్యంతో అలమటించేది. కానీ ఈ గ్రామం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

4. సరే,....?
ఈ వ్యక్తి (అన్నా హజారే) చేసిన సామాజిక సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇతనిని ప్రతిష్టాత్మకమై "పధ్మ భుషన్" అవార్డుతో సత్కరించింది.

5. నిజంగానా, అయితే ఇతను దేనికోసం పోరాటం చేశారు..?
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని పారద్రోలేందుకు చట్ట సవరణలు చేయాలని పోరాటం చేస్తున్నారు.

6. మరి ఇదెలా సాధ్యమవుతుంది..?
లోక్ పాల్ బిల్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వాధికారులను స్వతంత్రంగా విచారించి అవినీతిపరులకు సాధారణ కోర్టుల కన్నా అత్యంత వేగంగా శిక్ష పడేలా చేయటం ఈ బిల్లు ప్రత్యేకత. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చాలా కాలం నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

7. ఇది పూర్తిగా కొత్త విషయమే కదా..?
కాదు.. 1972లోనే ఈ బిల్లును ప్రతిపాదించడం జరిగింది. అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతి భూషన్ ఈ బిల్లును ప్రతిపాదించారు. కానీ మారుతున్న ప్రభుత్వాలు మాత్రం దీనిని పక్కకు నెట్టేస్తూ వచ్చాయి. కొందరు అవినీతి రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ బిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈసారి ఎలాగైన ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించేలా చేయాలని హజారే నడుం బిగించారు. యువత కూడా భారీగానే ఆయనకు తమ మద్దతు తెలుపుతున్నారు.

8. ఓహో.. అలాగా... మరి అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది ఆ బిల్లు పూర్తిగా అమలయ్యేలా చేయడానికన్నమాట..! మరి ఇంత తక్కువ సమయంలో అదెలా సాధ్యమవుతుంది..?
హజారే మొదటిగా అడుగుతున్నదేంటంటే.. ఈ బిల్లును ఆమోదిస్తానని ప్రభుత్వం ముందు రావాలి. తర్వాత లోక్ పాల్ బిల్లును డ్రాఫ్ట్ చేయడానికి.. 50 శాతం ప్రభుత్వం తరఫు నుంచి, 50 శాతం ప్రజల తరఫు నుంచి కూడిన సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ సంయుక్త కమిటీని (జాయింట్ కమిటీని) ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్మడం అసాధ్యం. అలా చేస్తే ప్రభుత్వంలో ఉన్న కొందరు అవినీతిపరులు చట్టం కళ్లు కప్పి తప్పించుకునే ఆస్కారం ఉంది.

9. బావుంది, ఈ బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుంది..?
లోక్ పాల్ బిల్లు పాస్ అయితే కేంద్రం ఓ "లోక్ పాల్‌"ను ఎన్నుకోవడం జరుగుతుంది. అతనికి పూర్తి స్వతంత్రాధికారాలు ఉంటాయి. ఉదాహారణకు భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మాదిరిగా అన్నమాట. ప్రతి ఒక్క స్థాయిలోనూ లోకాయిక్తను నియమించడం జరుగుతుంది. ఒక్క ఏడాదిలోపు అవినీతిపరులందరనీ విచారించడం జరుగుతుంది. మరో ఏడాదిలోగా సదరు అక్రమార్కులను శిక్షించడం జరుగుతుంది. భోఫోర్స్ కుంభకోణం, భోఫాల్ గ్యాస్ విషాదం వంటి కేసుల్లో మాదిరిగా 25 ఏళ్ల పాటు విచారణ జరిపి చిన్న చిన్న శిక్షలు విధించ కుండా ఉండాలంటే ఈ బిల్లు పాస్ అవ్వాల్సిందే. ఈ బిల్లు పాస్ అయితే.. రెండేళ్లలోపే అవినీతిపరులు ఊచలు లెక్కబెడతారన్నమాట.

10. అతను ఒక్కడేనా..? అన్నా హజారేతో ఈ పోరాటంలో మరెవరూ లేరా..?
ఎందుకు లేరు... మాజీ ఐపిఎస్ కిరణ్ బేడి, ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్ కెజ్రివాల్‌ కూడా ఆయనకు తోడుగా నిలిచారు. అంతేకాకుండా.. అశేష భారతావని జనం ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

సరే అర్థమైంది. మరి నేనేం చేయగలను..?
అవీనితిపై జరుగుతున్న ఈ పోరాంటంలో పాల్గొందాం. అన్నా హజారేకు మన మద్దతు ప్రకటిద్దాం. కనీసం ఈ సందేశాన్నైనా మీ మిత్రులు శ్రేయోభిలాషులకు చేరవేద్దాం. అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. భావిసమాజానికి బాటలు వేద్దాం. మన తర్వాతి తరమైన హాయిగా గుండెలపై చేయి వేసుకొని నిద్రేంచేలా చేద్దాం..!

3 comments:

  1. Could you (writer) please give me permission to use this content as it is in my blog and facebook page?

    Arun
    http://mail2achamga.blogspot.com

    ReplyDelete
  2. fine if it is for a good cause. but please refer the source.

    ReplyDelete
  3. @ దిలీప్ రెడ్డి: ధన్యవాదాలు.

    ReplyDelete