మరిన్ని గ్రూప్‌-2 కొలువులు -కొత్తగా 295 పోస్టులు




మరిన్ని గ్రూప్‌-2 కొలువులు
కొత్తగా 295 పోస్టులు
2008 ప్రకటనకు 191 అదనం
ఉద్యోగాల భర్తీకి సిద్ధం
హైదరాబాద్‌

నిరుద్యోగులకు శుభవార్త. గ్రూపు-2 కింద కొత్త ప్రకటన వెలువడనుంది. 2011 ఏడాది కింద వెలువడనున్న ఈ ప్రకటన ద్వారా 295 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది. ఇక 2008 ప్రకటనకు 191 పోస్టులను అదనంగా కలపనుంది. దీంతో కొత్తగా గ్రూప్‌-2 అభ్యర్థులకు 486 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇది వారిలో ఉత్సాహం నింపుతోంది.
గ్రూపు-2 కింద 682 పోస్టుల భర్తీకి 2008లో ప్రకటన వెలువడింది. 4,54,000 మంది దరఖాస్తు చేశారు. ఇంతవరకు రాతపరీక్ష జరగలేదు. మరోవైపు అదనపు పోస్టులను కలపాలనే అంశంపై నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీనిని అనుసరించి అదనంగా మరో 191 పోస్టులను కలిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2008 ప్రకటనతో సంబంధం లేకుండా గ్రూప్‌-2 కింద తాజాగా మరో ప్రకటన జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరీక్షలు ఎప్పుడు?: 2008 గ్రూప్‌-2 పరీక్షను ఇంతవరకూ నిర్వహించలేదు. అందువల్లే ఈ ప్రకటనకు అదనపు పోస్టులను కలిపేందుకు అవరోధం ఏర్పడలేదు. 191 పోస్టులను అదనంగా కలుపుతున్నందున మళ్లీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే నాలుగున్నర లక్షలమందికిపైగా దరఖాస్తు చేసినందున మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడంపై సందిగ్ధం నెలకొంది. జులైదాకా ఏపీపీఎస్సీ వివిధ రకాల రాత పరీక్షలతో బిజీగా ఉంది. ఆ తర్వాతే 2008 పరీక్ష గురించి ఆలోచించనుంది. ఆ పరీక్ష అయితేగానీ 2011 ప్రకటన జారీ విషయం ముందుకు వస్తుంది.

No comments:

Post a Comment