ఐ.ఎఫ్.ఎస్ (I.F.S-Indian Forest Service) టాపర్ చెప్పిన కిటుకులు


జనరల్ సైన్సూ ముఖ్యమే...!











జంతురాజ్యం

రాబర్‌‌ట విట్టేకర్ ప్రతిపాదించిన జీవుల వర్గీకరణ బహుకణ జంతువులన్నింటినీ జంతురాజ్యం (Animalia)లో వర్గీకరించారు. జీవులన్నిం టిలో జంతువులు సంక్లిష్టమైనవి. జంతువుల శరీర నిర్మాణం, శరీర ధర్మాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అతి సరళ జంతువులు ప్రోటోజో వా జీవులు. ఇవి మొదటి, ఏకకణ జంతువులు. ప్రస్తుత వర్గీకరణ బట్టి వీటిని ప్రోటిస్టా రాజ్యం లో వర్గీకరించారు. జంతువులను అనేక ప్రధాన వర్గాల్లోకి విభజిస్తారు. ఒక వర్గంలోని జంతువు లన్నీ కొన్ని సామాన్య సాధారణ లక్షణాలు ప్రదర్శిస్తాయి. ఐతే వీటిలో కూడా ప్రత్యేకతలు ఉండటం ద్వారా ఒక వర్గాన్ని విభాగాల్లో, విభా గాన్ని క్రమంలో విభజిస్తారు. 

ఉదాహరణకు మానవుడు కార్డేటా వర్గానికి చెందినవాడు. ఈ వర్గంలోని క్షీరదాల (mammals) విభాగంలోని ప్రైమేట్స్ (Primates) క్రమంలో మనిషిని వర్గీకరించారు. ఒక క్రమంలో అవే ప్రజాతి (Genus)లు ఉంటాయి. ఒక ప్రజాతిలో అనేక జాతులు (species) ఉంటాయి. ఒక జాతి అంటే తమలోతాము అంతర్‌ప్రజననం చెందే సమాన లక్షణాలున్న జీవుల సమూహమని అర్థం. సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 పరీక్షల్లో తరచుగా జంతువర్గం లేదా రకాల ప్రశ్నలొతస్తున్నాయి. ప్రశ్నలు ఎక్కువగా జంతువుల ప్రత్యేక లక్షణాలు, జంతువుల ఉప యోగాలపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని జంతు వర్గాలు చదువుకోవాలి.

జంతువులన్నిట్లో సంక్లిష్టమైంది కార్డేటా. మిగతా వర్గాలను నాన్-కార్డేటా వర్గాలంటారు. ప్రధాన నాన్‌కార్డేటా వర్గాలు.. ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మింథిస్, నెమాటి హెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపొడా మొలస్కా, ఇకైనోడెర్మేటా. ప్రోటోజోవా ఏకకణ జీవులున్న వర్గం. వీటిలో కణం జీవిగా వ్యవహ రిస్తుంది. పోషణ, శ్వాస, విసర్జక క్రియలు ప్లాస్మాత్వచం ద్వారానే జరుగుతాయి. ఇవి అత్యధికంగా స్వేచ్ఛా జీవులు. ఉదా: అమీబా, పారామీసియం, యుగ్లీనా. కొన్ని పరాన్న జీవులుగా వ్యవహరిస్తూ మానవుడు ఇతర జంతువులకు వ్యాధులు కలిగిస్తున్నాయి. ఉదా: ప్లాస్మోడియం (మలేరియా), లిష్మానియా డొనొ వాని (కాలా అజార్), లిష్మానియా ట్రాఫికా (ఢిల్లీ బామిల్స్), ఎంటమీబా హిస్టాలిటికా (అమీబియాసిస్).

మొదటి బహుకణ జంతువుల వర్గం పొరి ఫెరా. వీటి శరీరమంతా రంధ్రాలు ఉంటాయి. సాధారణంగా వీటిని స్పంజికలు అంటారు. వీటిలో పోషణ, శ్వాస, విసర్జక క్రియ, ప్రత్యు త్పత్తిలో ఉపయోగపడే కుల్య వ్యవస్థ, రక్షణ కోసం కంటకాలు (spicules) అనే ముళ్ల వంటి నిర్మాణాలుంటాయి. ఉదా: యూస్పాంజియా, యూప్లెక్టెల్లా, క్లయోనా.
మొదట కణజాలయుత జంతువర్గం సీలెం టిరేటా లేదా నిడేరియా. వీటిలో ఆహార సేకరణ, రక్షణ, చలనంలో ఉపయోగపడే వంశ కణాలు (nidoblasts/ Nemat-oblasts) ఉండడం ప్రత్యేకత.

ఉదా: హైడ్రా, జెల్లీ ఫిష్, సీఫ్యాన్, సీఫెరర్
ఈ వర్గంలోని ప్రవాళంలో కొన్ని ఉష్ణ సముద్రాల్లో తీరం నుంచి కొన్ని కి.మీ. దూరం లో ప్రవాళ అవరోధాలు (coral reefs) నిర్మి స్తాయి. ఇవి అధిక జీవవైవిధ్యానికి నిలయాలు.
మొదటి అవయవ శ్రేణి జంతువులు ప్లాటీ హెల్మింథిస్. ఇవి అధికంగా పరాన్న జీవులు.
ఉదా: బద్దెపురుగులు, ఫ్లూక్‌లు. కొన్ని స్వేచ్ఛాజీవులు. ఉదా: ప్లనేరియన్‌లు. 

వీటిలోని విసర్జకాంగాలు జ్వాలా కణాలు. నిజమైన పురుగులు ఉన్న వర్గం నెమాటిహెల్మిం థిస్, నాళంలో నాళం లాంటి శరీర నిర్మాణాన్ని ప్రదర్శించే వీటిలో... అధికంగా పరాన్నజీవులు లీ ఆస్కారిస్ (గుండ్రటి పురుగు), ఆంకైలోస్టో మా(కొక్కెపురుగు), ప్యుచరేరియా (ఫైలేరియా పురుగు). నిజమైన శరీర ఖండీ భవనం, శరీర కుహరాలు అభివృద్ధి చెందిన మొదటి జంతు వర్గం అనెలిడా. ఈ వర్గంలో వానపాములు, జలగలు, నిరీస్, సముద్ర ఎలుక వంటి జంతు వులుంటాయి. 

అతి పెద్ద జంతువర్గం ఆర్ద్రో పోడా. వీటిలో కీటకాలు, క్రస్టేసియన్‌లు(రొ య్యలు, పీతలు, లాబ్ట్సర్‌లు(షింప్‌లు), అరాక్ని డన్‌లు(తేళ్లు సాలీడు టిక్‌లు మైట్‌లు) మిరియా పాడ్‌లు(శతపాదులు, సహస్రపాదులు)పెరిప్యా టిస్ అనే జంతువులుంటాయి. కీటకాల్లో మూడు జతల కాళ్లు, రెండు జతల రెక్కలు, విస ర్జకంగాలుగా మాల్ఫిజీయన్ నాళికలు, శ్వాసాం గాలుగా వాయునాళాలు, నత్రజని వ్యర్థంగా యూరిక్ ఆమ్లం, సంయుక్త నేత్రాలు ఉంటాయి. రెండో అతిపెద్ద జంతువర్గం మొలస్కా. మృదు వైన శరీరమున్న ఈ జంతువులన్నిట్లో దాదాపు రక్షణ కోసం కర్పరం (shell) ఉంటుంది. నీటి నాణ్యత తెలుసుకునే ఆస్ఫ్రేడియాలు అనే జ్ఞానేంద్రియం ఉండటం వీటి ప్రత్యేకత.

ఉదా: నత్తలు, ముత్యపు చిప్పలు, స్వ్విడ్‌లు, మసల్స్, క్లాంలు, సెపియా అక్టోపస్.
కేవలం సముద్ర జీవులు మాత్రమే ఉన్న జంతువర్గం ఇకైనోడెర్మాటా. వీటి శరీరమంతా ముళ్లుంటాయి. చలనం కోసం జలప్రసరణ వ్యవస్థ ఉండటం వీటి ప్రత్యేకత. ఉదా: స్టార్‌ఫిష్, సీ లిల్లీలు, సముద్ర దోసకాయలు
శరీర పృష్ట మధ్య భాగంలో పృష్ఠదండం అనే దండాకార నిర్మాణం లేదా దాని రూపాం తర నిర్మాణం ఉన్న జంతువులు కార్డేటా వర్గంలో ఉంటాయి. వీటిలో అధిక జీవుల్లో పృష్ఠ దండం వెన్నెముకగా మారి ఉంటుంది. వీటిని సకశేరుకాలంటారు. సకశేరుకాలు ప్రధానంగా రెండు రకాలు. దవడలు లేని నిమ్న సకశేరుకాలు. ఉదా: మిక్సిన్ (Hagfish), పెట్రోమైజాన్ (Lamforey). ఇవి చేపలా ఉండే జలచరాలు. రెండో రకం దవడలు ఉన్న ఉన్నత సకశేరుకాలు. ఇవి ఐదు రకాలు... చేపలు, ఉభయ చరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. చేపలు తప్ప మిగతా నాలుగు రకాలు చతుష్టాదులు.

చేపలు, ఉభయ చరజీవులు, సరీసృపాలు- శీతల రక్త, అస్థిరోష్ణ జంతువులు. పక్షులు, క్షీరదాలు ఉష్టరక్త జీవులు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో అంతర ఫలదీక రణం ఉంటుంది. ఆడజీవి శరీరంలో పిండాభి వృద్ధి మొదలవుతుంది. పిండం చుట్టూ ఉల్బం తో సహా ఇతర పిండత్వచాలు ఏర్పడుతాయి. కాబట్టి ఈ మూడు రకాల సకశేరుకాలను ఉల్బ జీవులంటారు.

ప్రాక్టీస్ బిట్స్
1. వీటిలో కీటకం కానిది?
ఎ) బొద్దింక బి) సాలీడు
సి) బీటిల్ డి) సీతాకోకచిలుక

2. రుతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలసల అధ్యయనం?
ఎ) ఫినాలజీ బి) ఫ్రెనాలజీ
సి) ట్రోఫాలజీ డి) సెరాలజీ

3. నేషనల్ రీసెర్‌‌చ సెంటర్ ఆన్ కేమల్ (ఒంటె) ఎక్కడ ఉంది?
ఎ) జోథ్‌పూర్ బి) బికనీర్
సి) ఉదయ్‌పూర్ డి) జైపూర్

4. వీటిలో ఉభయలింగ జీవి?
ఎ) స్పంజిక బి) వానపాము
సి) బద్దెపురుగు డి) పైవన్నీ

5. అత్యంత వైవిధ్యమైన ప్రవాళఛిత్తికలు ఎక్కడ కనిపిస్తాయి?
ఎ) ఫిజీ దీవులు
బి) అండమాన్, నికోబార్ దీవులు
సి) ఆస్ట్రేలియా తీరం డి) లక్ష దీవులు

6. వీటిలో నిజమైన చేప?

ఎ) జెల్లీ ఫిష్ బి) స్టార్ ఫిష్
సి) సిల్వర్ ఫిష్ డి) స్టోన్ ఫిష్
7. ఏ ప్రోటీన్ ఆక్సీకరణ ద్వారా కొన్ని జంతు వుల శరీరం నుంచి కాంతి విడుదల వుతుంది?
ఎ) లైసోజైం బి) ల్యూసిఫెరిన్
సి) రెనిన్ డి) సెరిసిన్

8. కింది పట్టు రకాల్లో దేశీయ రకం?
ఎ) ఎరి బి) ముగా సి) తసార్ డి) మల్బరీ
9. లక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
ఎ) శ్రీలంక బి) చైనా సి) భారత్ డి)జపాన్

10. సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్‌‌చ ఇన్‌స్టి ట్యూట్ ఎక్కడుంది?
ఎ) కోల్‌కత్తా బి) ముంబై
సి) విశాఖపట్నం డి) తిరువనంతపురం

11. బద్దెపురుగుల విసర్జకాంగాలు?
ఎ) వృక్కాలు బి) జ్వాలాకణాలు
సి) మాల్ఫీజియన్ నాళికలు డి) చర్మం

12. సముద్ర కుందేలు ఏ రకమైన జంతువు?
ఎ) చేప బి) సరీసృపం
సి) క్షీరదం డి) ఏదీ కాదు

13. అతిపెద్ద అకశేరుకం?
ఎ) అక్టోపస్ బి) టెరిడో
సి) ఆర్కిట్యులిస్ డి) సెపియా

14. ముత్యాల పరిశ్రమకు పితామహుడు?
ఎ) కొకిచి మికిమొటొబి) మిస్‌టుచి
సి) ఇసూజి డి) కికు కెమైనీ

15. పడవలకు చిల్లు పెట్టే మొలస్కా జంతువు? 
ఎ) సెపియా బి) లాలిగో
సి) డోరిస్ డి) టెరిడో

16. విలువైన ముత్యం దేని నుంచి లభిస్తుంది?
ఎ) యునియో బి) మైటిలస్
సి) పింక్టాడా డి) నాటిలస్
17. జలగను ఉపయోగించి శరీరంలో చెడు రక్తాన్ని తొలగించే ప్రక్రియ?
ఎ) ఫ్లె బొటొమీ బి) అపోలైసిస్
సి) డిఫ్యూజన్ డి) ప్లాస్మోలైసిస్

18. సముద్ర ఎలుక ఏ జంతు వర్గానికి చెందింది?
ఎ) ఆర్ధ్రోపొడా బి) అనెలిడా
సి) మొలస్కా డి) ఇకైనోడెర్మాటా

19. తేనెటీగ డింభకం?
ఎ) రిగ్లర్ బి) క్యాటర్‌పిల్లర్
సి) మాగ్గాట్ డి) గ్రబ్

20. చీమల అధ్యయనం?
ఎ) మిర్మికాలజీ బి) ఏరినాలజీ
సి) లెపిడోటెరాలజీ డి) అకరాలజీ

21. ఏ కీటకం ద్వారా కాలా అజార్ వ్యాప్తి చెందుతుంది?
ఎ) స్యాండ్ ఫ్లై బి) దోమ
సి) సీ-సీ ఫ్లై డి) ఏదీ కాదు

22. ఏ దోమ కాటు ద్వారా ఎల్లో ఫీవర్ వ్యాప్తి చెందుతుంది?
ఎ) క్యూలెక్స్ బి) అనాఫిలిస్
సి) ఎడిస్ డి) ఏదీ కాదు

23. కీటకాల్లో రెక్కలు, కాళ్ల ఎన్ని జతలు?
ఎ) రెండు, మూడు బి) మూడు, రెండు
సి) ఒకటి, రెండు డి) రెండు, ఒకటి

24. తిమింగలాల, డాల్ఫిన్ల ప్రధాన శ్వాసాంగాలు?
ఎ) మొప్పలు బి) చర్మం
సి) ఊపిరితిత్తులు డి) పైవన్నీ

25. ఎగిరే సర్పం?
ఎ) పీడోసిప్రిస్ బి) గెకో
సి) డ్రాకో డి) క్రైసోపిలియా

26. సముద్ర తోడేళ్లు ఏ రకమైన జంతువులు?
ఎ) సముద్ర సర్పాలు బి) సొర చేపలు
సి) విద్యుత్ రే చేపలు
డి) సముద్ర క్షీరదాలు

27. కింది వాటిలో ఉల్బజీవి?
ఎ) కప్ప బి) సొరచేప
సి) ఉడుము డి) సాలమండర్

28. సర్పాల్లోని ప్రధాన ఘ్రాణాంగాలు?
ఎ) జాకబ్‌సన్‌‌స బి) కీబర్‌‌స అంగాలు
సి) బొజానస్ అంగాలు
డి) చేపల్లో ఘ్రాణాంగాలు ఉండవు

29. మంచినీటి తాబేళ్లు?
ఎ) టెర్రాపిన్‌‌స బి) టర్టల్స్
సి) టార్టియిజ్ డి) ఏదీ కాదు

30. వీటిలో ఎగరని పక్షి?
ఎ) ఆస్ట్రిచ్ బి)కస్సావోరి
సి) టినామస్ డి)పైవన్నీ

31. భారీ సమూహాల్లో వచ్చి పంటను నష్టపర్చే కీటకం?
ఎ) ఎఫిడ్ బి) లోకస్ట్
సి) హార్‌‌నఫ్లై డి) బాటిల్ ఫ్లై

32. కింది క్షీరదాల్లో ఉభయచరజీవి?
ఎ) వాల్స్ బి) సీల్
సి) కైరోనెక్టస్ డి) పైవన్నీ

33. సజీవ శిలాజంగా పిలిచే స్ఫీనోడాన్ ఏ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది?
ఎ) ఆస్ట్రేలియా బి) ఆగ్నేయాసియా
సి) న్యూజిలాండ్ డి) భారత్

34. వీటిలో ఊపిరితిత్తి చేప?
ఎ) ప్రోటోపైరస్ బి) లెపిడోసైరిన్
సి) నియోసెరటోడస్ డి) పైవన్నీ

35. వీటిలో శీతల రక్త జంతువులు?
ఎ) కప్ప బి) చేప సి) బల్లి డి) పైవన్నీ
36. ఫ్లైయింగ్ ఫాక్స్ ఏ జంతువు?
ఎ) బల్లి బి) కప్ప సి) పక్షి డి) గబ్బిలం

37. సముద్రం నుంచి నదికి, తిరిగి సముద్రానికి వలస వెళ్లే చేపలు?
ఎ) అనాడ్రోమస్ బి) కెటాడ్రోమస్
సి) ఆంఫీడ్రోమస్ డి) పొటామొడ్రోమస్

సమాధానాలు
1) బి 2) ఎ 3) బి 4) డి 5) ఎ
6) డి 7) బి 8) సి 9) సి 10) ఎ
11) బి 12) డి 13) సి 14) ఎ 15) డి
16) సి 17) ఎ 18) బి 19) డి 20) ఎ
21) ఎ 22) సి 23) ఎ 24) సి 25) డి
26) బి 27) సి 28) ఎ 29) ఎ 30) డి
31) బి 32) డి 33) సి 34) డి 35) డి
36) డి 37) ఎ

సీడీఎస్‌ కి(CDS-Combined Defense Services) సిద్ధమవ్వండిలా...

తెలుగు 'నటరాజు' కన్నుమూత


తెలుగు 'నటరాజు' కన్నుమూత
పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం రూపకర్త రామకృష్ణ మృతి 
 కళాదిగ్గజం నేలరాలింది... తెలుగువారి ప్రాచీన నాట్యకళారీతులకు తిరిగి జీవంపోసి... ఆరు దశాబ్దాలుగా దశదిశలా వ్యాపింపజేసిన భరత కళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ మంగళవారం ఉదయం మరణించారు. ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం వంటి నాట్య రీతులకు వూపిరిలూదిన ఆయన వయసు 88 సంవత్సరాలు. వేలాది మందికి శిక్షణనిచ్చిన ఈ నాట్యగురువు... ఐదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతనెల 26న పరిస్థితి విషమించడంతో శిష్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుముశారు. భౌతికకాయాన్ని శిష్యగణం సందర్శనార్థం బేగంపేటలోని కళాకృష్ణ అనే శిష్యుని నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కళకే అంకితమైపోయిన రామకృష్ణ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సోదరి, సోదరుడు చాన్నాళ్ల క్రితమే చనిపోయాగా శిష్యుల నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు.ప్రఖ్యాత నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ మృతికి పలువురు నివాళులు అర్పించారు. ఆంధ్రనాట్యానికి, పేరిణి నృత్యానికి, కూడిపూడి సంప్రదాయరీతులకు రామకృష్ణ విశేష ప్రాచుర్యం కల్పించారని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నాట్యాన్నే జీవిత సర్వస్వంగా చేసుకొని ఆరు దశాబ్దాలుగా కళామతల్లికి విశేష సేవలందించిన కళాదిగ్గజం అని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. కళను, సునిశిత మేధస్సును రంగరించి ఆయన చేసే పేరిణి శివతాండవం నృత్యరూపకం అద్భుతమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. నటరాజ రామకృష్ణ అస్తమయం కళా ప్రపంచానికి తీరనిలోటని, తెలంగాణ నృత్య విశేషం 'పేరిణి'ని పునరుజ్జీవింపజేసిన మహానాట్యాచార్యుడు అంటూ తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ తన సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు తారామతి బారాదరి వద్ద ప్రభుత్వ లాంఛనాలతో రామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రమణమూర్తి తెలిపారు.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
చిన్ననాటే 'నటరాజు' బిరుదాంకితుడైన రామకృష్ణ పూర్వీకులది కోనసీమ ప్రాంతం. అప్పట్లో ఇండోనేషియాకు వలసపోయారు. 1923 మార్చి 21న బాలి ద్వీపంలో రాంమోహన్‌రావు, దమయంతి దంపతులకు రామకృష్ణ జన్మించారు. తల్లిది నల్గొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక. రామకృష్ణ చిన్నతనంలోనే ఆమె మృతిచెందారు. తర్వాత ఆయన కుటుంబం ఇండోనేషియా నుంచి చెన్నైకి వచ్చేసింది. పదో ఏట నుంచే నాట్యంపై మక్కువ ఉండేది. గజ్జెలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్లకు కట్టుకుని నాట్యం అభ్యసించేవారు. క్రమంగా సోదరుడి సాయంతో ప్రసిద్ధ కళాకారుల వద్ద నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. భరతనాట్యంతో ప్రారంభించి ఎన్నో నృత్యరీతులను నేర్చుకున్నారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఆయన ఆజన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. చెన్నై నుంచి ఆరు దశాబ్దాల క్రితం తెలుగుగడ్డపై అడుగుపెట్టారు. శ్రీకాళహస్తిలో ఎక్కువ కాలం నాట్యశిక్షణ పొందారు. పుట్టింది ఇండోనేషియాలో... పెరిగింది చెన్నైలో... చదువంతా నాగపూర్‌లో... కాని ఆయన జీవితమంతా తెలుగుకళకే అంకితం చేయడం విశేషం.నాట్యరీతులకు పునరుజ్జీవనం
*స్వయంగా నాటకాలు రచించి ప్రదర్శిస్తూ, ఎంతోమంది కళాకారులకు శిక్షణనిస్తూ గడిపేవారు రామకృష్ణ. ఆయన సృష్టించిన అద్భుతమైన నాట్య ప్రక్రియల్లో 'నవ జనార్దన పారిజాతం' విశేష జనాదరణ పొందింది.
*దేవదాసీ చట్టం అమల్లోకి రావడంతో దేవదాసీలు కనుమరుగయ్యారు. ఆ నృత్యరీతులు కూడా తెరమరుగయ్యాయి. అలాంటి సమయంలో అద్భుతమైన ఆ నాట్య ప్రక్రియకు తిరిగి జీవం పోయాలనే సంకల్పంతో నటరాజ రామకృష్ణ ఊరూరా తిరిగి నృత్య కళాకారిణులను సంఘటితపరచి, సంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేసి 'ఆంధ్రనాట్యం' పేరిట దానిని తిరిగి తెలుగునాట సుస్థిరం చేశారు.
*700 ఏళ్ల క్రితం మరుగున పడిన కాకతీయుల కాలం నాటి 'పేరిణి శివ తాండవం' నృత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఏ ప్రభుత్వమూ, పాలకులూ, అకాడమీలూ, విశ్వవిద్యాలయాలూ చేయని పనిని రామకృష్ణ చేసి చూపించారు. పురుషులు మాత్రమే చేసే ఈ నృత్యాన్ని నృత్యరత్నావళి గ్రంథం ద్వారా తెలుసుకుని విశేష ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆయన చేసిన ఓ అద్భుతం. ఆ స్ఫూర్తితోనే తర్వాత అనేక వందలమంది మగపిల్లలు గజ్జెకట్టి రంగస్థలంపైకి చేరారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడాయన శిష్యులు, ప్రశిష్యులు దేశవిదేశాల్లో వేలాదిగా ఉన్నారు.
*నాట్య కళారీతులపై వందలాది వ్యాసాలతోపాటు నలభైకి పైగా గ్రంథాలను, ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని ఆయన రచించారు.
పద్దెనిమిదో ఏటనే నటరాజు...
*మహారాష్ట్రలోని బందార సంస్థానం రాజాగణపతి పాండ్య 18వ ఏటనే రామకృష్ణను 'నటరాజ' బిరుదుతో సత్కరించారు. అప్పటినుంచి అది ఆయన సార్థకనామధేయమైంది.
*1968లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 'భరత కళాప్రపూర్ణ బిరుదు'తో గౌరవించింది.
*1980లో శ్రీశైల దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఏడాది ఆస్థాన నాట్యాచార్యునిగా నియమించింది.
*కళాప్రపూర్ణ, కళాసరస్వతి, రాజ్యలక్ష్మి అవార్డులు అందుకున్నారు.
*1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ 'దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడు' బిరుదుతో సత్కరించింది.
*వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
*కేంద్ర ప్రభుత్వం 1992లో 'పద్మశ్రీ'తో గౌరవించింది.

పాఠకులకు విగ్నప్తి


పాఠకులకు విగ్నప్తి

ల ను అప్ డేట్ చేయడం జరిగింది.చూడగలరు


                                                       -ఇట్లు మీ దిలీప్

బ్యాంకు కొలువుకు సిద్ధమవుదాం

బ్యాంకు కొలువుకు సిద్ధమవుదాం ఎస్‌. అరుణ్‌మోహన్‌
డైరెక్టర్‌, బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌
బ్యాంకింగ్‌ నియామకాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఎస్‌బీఐ నుంచి 1000 పీఓ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారందరూ పరీక్ష రాయవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఎలా సంసిద్ధమవ్వాలో పరిశీలిద్దాం!
ఎస్‌.బి.ఐ. పీఓ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు (గడువు జూన్‌ 9) చేసుకునేటప్పుడు కేటగిరీ కాలమ్‌ నింపడానికి కోడ్‌లు ఉన్నాయి. ఆయా కేటగిరీ అభ్యర్థులు తమ విభాగానికి సంబంధించిన కోడ్‌ను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాలలో పరీక్ష కేంద్రాలున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొబేషనరీ కాలపరిమితి రెండేళ్లు. నెల జీతం ప్రారంభంలో అన్నీ కలిపి రూ. 27,800 వరకు ఉంటుంది. ఎస్‌.బి.ఐ. పరీక్షకు హాజరయ్యే విషయంలో పరిమితి ఉంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు నాలుగుసార్లు, ఓబీసీ వారు 7 సార్లు మాత్రమే రాయడానికి వీలుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి పరిమితులూ లేవు.
ఎంపిక ప్రక్రియ
ఇది రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ రాత పరీక్ష. రెండో దశ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ. జులై 24న జరిగే రాత పరీక్షలో 200 మార్కులకు 2 గంటల కాల వ్యవధిలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష జరుగుతుంది. 50 మార్కులకు గంట వ్యవధిలో డిస్క్రిప్టివ్‌ పరీక్ష జరుగతుంది.
ఆబ్జెక్టివ్‌ పరీక్షలో 4 విభాగాలుంటాయి.
1. ఇంగ్లిష్‌ లాంగ్వేజి: ఇతర బ్యాంకు పీఓ పరీక్షల లాగే ఎస్‌బీఐలో కూడా ఇంగ్లిషు విషయంలో గ్రామర్‌, వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లదే ప్రధాన పాత్ర. గ్రామర్‌లో ప్రాథమికాంశాల ప్రిపరేషన్‌ ముఖ్యం. ప్రాక్టీసు చేయడం ద్వారా కాంప్రహెన్షన్‌పై పట్టు పెంచుకోవచ్చు. ఎస్‌.బి.ఐ. పరీక్షలో ఇంగ్లిషులో వచ్చిన మార్కులు మెరిట్‌ ర్యాంకింగ్‌ కోసం పరిగణిస్తారు.
2. జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌ : జనరల్‌ అవేర్‌నెస్‌ బిట్స్‌ కోసం అప్‌డేట్‌ చేసుకునే సమాచారంతోనే మార్కెటింగ్‌ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్‌, మెటీరియల్‌ సేకరణ అంతగా అవసరం లేదు. ప్రతిరోజూ ఆర్థిక సంబంధమైన ఒక వార్తాపత్రిక ఉదా. బిజినెస్‌ లైన్‌, ఎకనామిక్‌ టైమ్స్‌లతో పాటు బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌ లాంటి మ్యాగజీన్లు చదవటం మేలు.
3. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: మిగిలిన విభాగాలతో పోలిస్తే అభ్యర్థి ఈ విభాగంపై ఎక్కువ శ్రద్ధ, సమయం పెట్టవలసి వస్తుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రిపరేషన్‌లో హైఎండ్‌ అంశాలు ఇవి. ప్రాథమికంగా అర్థమెటిక్‌ అంశాల ప్రిపరేషన్‌పై పట్టు సాధించిన తరవాత ఇచ్చిన డేటాను సమర్థంగా విశ్లేషించగలుగుతారు. విశ్లేషించిన సమాచారాన్ని ప్రజెంట్‌ చేయడానికి సృజనాత్మకత కొంతమేరకు అవసరం అవుతుంది. కాబట్టి ఈ విభాగం విషయంలో అభ్యర్థి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి సాధన చేయాల్సి ఉంటుంది.
4. రీజనింగ్‌ (హైలెవెల్‌): పూర్తిగా లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌దే పాత్ర. అభ్యర్థి విశ్లేషణాత్మక, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ విభాగపు ముఖ్య ఉద్దేశం. అభ్యర్థిలో ఉన్న తార్కిక ప్రతిభను ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ప్రాథమిక స్థాయి రీజనింగ్‌ ప్రిపరేషన్‌ మాత్రమే కాకుండా స్టాండర్డ్‌ పుస్తకాల ప్రిపరేషన్‌ ద్వారా సన్నద్ధమవ్వాలి.
డిస్క్రిప్టివ్‌ పేపరు విషయంలో ఎస్‌.బి.ఐ. పీఓ పేపరుకూ, ఇతర బ్యాంకు పీఓ పేపరుకూ వ్యత్యాసం ఉంది. ఇతర బ్యాంకు పీఓ పేపర్లలో మాదిరిగా ఆర్థిక సామాజిక విషయాలపై కాకుండా ఎస్‌.బి.ఐ. పీఓలో డిస్క్రిప్టివ్‌ పేపరు ఇంగ్లిషు లాంగ్వేజికి సంబంధించి ఉంటుంది. వ్యాసరచన, లెటర్‌ రైటింగ్‌, కాంప్రహెన్షన్‌ మొదలైన అంశాల ప్రశ్నలుంటాయి.
ప్రణాళికాబద్ధంగా కృషి చేసి సన్నద్ధమైతే రాతపరీక్షలో నెగ్గి, గ్రూప్‌డిస్కషన్‌, ఇంటర్వ్యూ దశల్లోకి దూసుకువెళ్ళ గలుగుతారు.
.
ఇలా సన్నద్ధం కండి! జి.ఎస్‌. గిరిధర్‌
డైరెక్టర్‌, RACE
డేటా ఎనాలసిస్‌, ఇంటర్‌ప్రెటేషన్‌లో Reading comprehension passageని చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయాల్సివుంటుంది. అలాగే డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో passageకి బదులుగా డేటా, గ్రాఫ్‌లు, ఛార్టులు, పట్టికల రూపంలో ఉంటాయి; దానికి సంబంధించిన ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. ఈ విభాగం పీఓ పరీక్ష రాసేవారికి కొత్తదేమీ కాదు. ఇతర పీఓ పరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని 50 ప్రశ్నల్లో 20-25 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి ఉంటాయి. ఎస్‌.బి.ఐ. పరీక్షలో 45 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచీ, 5 ప్రశ్నలు permutations and combinations, probability నుంచి ఉంటాయి. అభ్యర్థులు వివిధ రకాలైన గ్రాఫులు- అంటే బార్‌ డయాగ్రమ్‌, లైన్‌ గ్రాఫ్‌, పై-ఛార్ట్స్‌, టేబుల్స్‌ గురించి తెలుసుకోవాలి. అంకగణితం (Arithmetic)లోని అంశాల మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా శాతాలు, సరాసరి, నిష్పత్తులు, లాభం-నష్టం మీద అవగాహన ఉండాలి.
సూక్ష్మీకరణలు త్వరగా చేయగలగాలి. అందుచేత స్పీడ్‌ మ్యాథ్స్‌ లాంటివి నేర్చుకుంటే మంచిది. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ బాగా సాధన చేసి, కొన్ని ప్రశ్నలను పెన్ను ఉపయోగించకుండా గ్రాఫులను చూసినంతనే జవాబు గుర్తించేలా తయారవ్వాలి.
జనరల్‌ ఇంగ్లిష్‌
ఈ విభాగం ఎస్‌.బి.ఐ. పీఓ పరీక్షలో చాలా ముఖ్యమైంది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌... రెండు టెస్టుల్లోనూ ఈ విభాగముంది. డిస్క్రిప్టివ్‌ టెస్టు మార్కులను కూడా ఎంపిక ప్రక్రియలో పరిగణిస్తారు. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
విద్యార్థులు వ్యాకరణం (Grammar)మీద పట్టు పెంచుకోవాలి. గత ప్రశ్నపత్రాలను చూసి సరళిని గమనించి ఆ ప్రకారం సాధన చేయాలి. చాలామంది Reading comprehensionలోని ప్రశ్నలను సాధించడానికి 10-15 నిమిషాల సమయం తీసుకుంటారు. దీన్ని 5 నిమిషాల్లోపే పూర్తిచేయగలగాలి. చదివే వేగం పెరిగేలా చూసుకోవాలి. ఆంగ్ల వార్తాపత్రికలు చదవడం వల్ల కరెంట్‌ అఫైర్స్‌ను కూడా కవర్‌ చేయవచ్చును.
జనరల్‌ అవేర్‌నెస్‌
కరెంట్‌ అఫైర్స్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాలతో పాటు మార్కెటింగ్‌, కంప్యూటర్లకు సంబంధించిన వివరాలను కవర్‌ చేస్తూ గత 6-8నెలల పరిణామాలను బాగా చూసుకోవాలి. ఈ రెండు సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాల మీద బాగా అవగాహన పెంచుకోవాలి. Different types of marketing, consumer behaviour, product life cycle వంటి వాటి గురించి లోతుగా తెలుసుకోవాలి. బాగా స్కోర్‌ చేయగలిగే విభాగం కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, రీజనింగ్‌ విభాగాలలోని వివిధ టాపిక్స్‌పై ముందుగా అవగాహన పెంచుకొని అంశాల వారీగా ప్రశ్న జవాబులను సాధన చేయాలి. ఆపైన అన్ని టాపిక్స్‌కు సంబంధించిన Mixed bag of questions practiceచేయాలి. ప్రతిరోజూ అన్ని విభాగాలు కవర్‌ చేసే విధంగా క్రమబద్ధంగా, స్థిరంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఎస్‌.బి.ఐ. పరీక్షకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు 15- 20 రోజుల ముందు టాపిక్స్‌ అన్నింటినీ పూర్తిచేసి ఆపై పూర్తిగా పరీక్షా విధానంలో ప్రాక్టీస్‌ చేయాలి. ఆబ్జెక్టివ్‌ టెస్టులోని 2 గంటల సమయాన్ని 4 విభాగాలకు సబ్జెక్టు క్లిష్టత, ప్రశ్నల సంఖ్య ఆధారంగా విభజించుకోవాలి. General awareness 15 నిమిషాలలో... ఇంగ్లిష్‌ని 20 నిమిషాలలో పూర్తి చేసేవిధంగా సాధన కొనసాగాలి. గణిత ప్రశ్నలు అర నిమిషంలో సాధించేలా పరిణతి సాధించాలి.రోజుకు కనీసం ఐదారు గంటలు తగ్గకుండా సాధన కొనసాగిస్తే ఫలితం ఉంటుంది.